‘నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వంద సీట్లతో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో చేపట్టిన వైద్య కళాశాల పనులను కలెక్టర్ గౌతమ్తో కలిసి మంత్రి పరిశీలించి మాట్లాడారు.
ఖమ్మం, జూన్ 28: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి 100 సీట్లతో తరగతులు ప్రారంభంకానున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. పాత కలెక్టరేట్ భవనంలో జరుగుతున్న పనులను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ మెడికల్ కళాశాల పనులు చురుగ్గా సాగుతున్నాయని, అనుకున్న సమయానికి పూర్తి చేసి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
తరగతి భవనాలు, ప్రయోగశాలలు, అధ్యాపక బృందం, విద్యుత్, వివిధ విభాగాల ల్యాబ్లు, తరగతి గదులు, లైబ్రరీ, టాయిలెట్స్, తాగునీరు, పారింగ్, గ్రీనరీ, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. పాత కలెక్టరేట్ భవనం ఐదెకరాలు, ఆర్అండ్బీ కార్యాలయం మూడెకరాలు మొత్తం ఎనిమిదెకరాల సువిశాల ప్రాంగణంలో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఎదురుగా మెడికల్ కళాశాల, విద్యార్థులు, అధ్యాపకుల వసతిగృహాలు ఉండాల్సి ఉందని, అందుకోసం ప్రభుత్వం ఖమ్మం ప్రధానాసుపత్రికి ఎదురుగా ఉన్న పాత కలెక్టరేట్ భవనాన్ని రూ.9 కోట్లతో ఆధునీకరించి తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కళాశాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.166 కోట్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని సరిహద్దు జిల్లాల నుంచి వైద్యం కోసం రోగులు వస్తున్నారని, భవిష్యత్తులో వైద్యరంగానికి ఖమ్మం హబ్గా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, మెడికల్ కళాశాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సంసరణల జాతిపిత పీవీ
నివాళి అర్పించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం, జూన్ 28: అనేక సంసరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెకిచ్చిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పీవీ నర్సింహారావు 102వ జయంతి సందర్భంగా బుధవారం ఖమ్మం నగరం లకారం సరిల్లో ఉన్న పీవీ విగ్రహానికి కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగినరీతిలో గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. పీవీ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ విజయ్కుమార్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, చిరుమామిళ్ళ లక్ష్మి, ఆళ్ళ నిరీషా అంజిరెడ్డి, రాపర్తి శరత్, కూరాకుల వలరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, ఈశ్వరప్రగడ హరిబాబు, కొల్లు పద్మ, వనం కృష్ణవేణి, సతీశ్, రవికాంత్, ఎంఏ కరీం, షకీనా, పొన్నం వెంకటేశ్వర్లు ఉన్నారు.
అందుబాటులో అత్యాధునిక కంటి వైద్యసేవలు
అధునాతన పద్ధతిలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ‘ఫాకో’ యంత్ర పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కంటి వైద్య పరీక్షల నిమిత్తం రూ.28 లక్షల వ్యయంతో ఖమ్మం నగరంలోని జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘ఫాకో’ మిషన్ను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధ పడుతున్న పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఫాకో మిషన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లోని ప్రభుత్వ ప్రధానాసుపత్రుల్లో రూ.3.46 కోట్ల వ్యయంతో ఫాకో యంత్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాటరాక్ట్ సర్జరీల నిర్వహణలో ఈ అత్యాధునిక యంత్రాలు ఎంతో సహాయపడతాయన్నారు.
ఆల్ట్రాసౌండ్ పరిజ్ఞానంతో పనిచేసే యంత్రాల ద్వారా సర్జరీలు సులభంగా, వేగంగా చేసే అవకాశం ఉంటుందన్నారు. సర్జరీల తర్వాత రోగులు త్వరితగతిన కోలుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఫాకో మిషన్తో సర్జరీ తర్వాత కళ్లజోళ్ల అవసరం ఉండదని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 30 నుంచి 40 వేల రూపాయలయ్యే కంటి సర్జరీలను ఇకపై ప్రభుత్వ ఆసుపత్రల్లో ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్జరీలు నిర్వహించడానికి వైద్యసిబ్బందికి ప్రత్యేక శిక్షణ సైతం ఇప్పించడం జరిగిందన్నారు. కంటివెలుగులో భాగంగా కంటి సమస్యలు గుర్తించిన వారికి ఈ ఫాకో మిషన్ ద్వారా చికిత్స అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ తొమ్మిదేళ్ల పాలనలో వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందుబాటులో లేనివిధంగా అత్యాధునికమైన యంత్ర పరికరాలను తీసుకొచ్చి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వేదికగా ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులను వృథా చేసుకోకుండా పలురకాల పరీక్షలు నిర్వహించేలా ప్రత్యేక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, పలువురు ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.