సాయినాథుడి మందిరాలకు పోటెత్తిన భక్తులు
వరప్రదాత మందిరంలో మంత్రి అజయ్ ప్రత్యేక పూజలు
ఖమ్మం కల్చరల్/ రఘునాథపాలెం, జూలై 13: గురుపౌర్ణమి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. సాయినాథుడి ఆలయాలన్నీ భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున నుంచే షిరిడీ సాయి మందిరాల్లో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రెండేళ్ల కరోనా తరువాత ఈ ఏడాది సాయి మందిరాలలో పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడంతో వివిధ ప్రాంతాల్లోని సాయి మందిరాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణలను విశేషంగా నిర్వహించారు. ఖమ్మం గాంధీచౌక్ వరప్రదాత శ్రీషిరిడీ సాయి మందిరంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన మంత్రిని చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్రావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నిరంజన్, నూనె శశిధర్, తీర్థాల శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీడీవోస్ కాలనీ శ్రీషిరిడీ సాయి మందిరంలోనూ శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. రఘునాథపాలెంలోని శ్రీషిరిడీ సాయి మందిరం, చింతగుర్తిలో నూతనంగా నిర్మించిన షిరిడీ సాయిబాబా మందింరలో నిర్వాహకులు మద్దినేని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతినగర్లోని సాయిబాబా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో 6వ డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.