ఖమ్మం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న పలు అభివృద్ది, అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఉదయం ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలోని అబ్దిదారులకు చెక్కులు అందచేశారు. చెక్కులతో పాటు మహిళలకు చీర, సారెలను అందించారు. ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు.
ప్రతి అభివృద్ది పథకం ప్రజలకు ఉపయోగపడాలని, ప్రతి సంక్షేమ పథకం నిరుపేదల బ్రతుకులను మార్చాలనే సదుద్దేశ్యంతో సీఎం కేసీఆర్ తెలంగాణాలో పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు ధైర్యంగా ఆడ కూతుళ్ల వివాహాలు చేయగలుగుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమాలలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న,టిఆర్ఎస్ నగర అద్యక్షులు పగడాల నాగరాజు, మాజీ అధ్యక్షులు కమర్తపు మురళి, యువజన విభాగం అద్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య, నగర ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్కుమార్, బలుసు మురళీ కృష్ణ, తౌసిప్, మైనార్టీ అద్యక్షులు తాజుద్దీన్ ,గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఖమర్ నాయకులు శోభారాణి, షకీన ఆయా డివిజన్ల కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, మందడపు లక్ష్మి మనోహర్రావు, రోహిణి, శ్రావణి ,దోరేపల్లి శ్వేత తదితరులు పాల్గొన్నారు.