రఘునాథపాలెం, జనవరి 31 : రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ స్టేట్ స్టెప్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీ శనివారం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తుంబూరు సునీల్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సర్దార్ పటేల్ స్టేడియంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాబ్మేళాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది పెద్దఎత్తున జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5వేల ఉద్యోగాలు కల్పించేందుకు 65కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఫార్మా, ఐటీ జాబ్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, కాల్ సెంటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అడ్మినిస్ట్రేషన్, రియల్ఎస్టేట్, రిటైల్ హౌజ్ కీపింగ్, స్టోర్ మేనేజర్, డెలివరీ బాయ్స్, ఫిట్టర్, చెఫ్ అండ్ డ్రైవర్స్ వంటి ఉద్యోగాలు పొందేందుకు జీరో విద్యార్హత నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువత అర్హులుగా పాల్గొన్నారు. ఆసక్తి గల వారు కార్యాలయం లేదా 8886711991, 9642333668 ఫోన్నెంబర్లలో సంప్రదించాలని కోరారు. సమావేశంలో సమాచార పౌరసంబంధాల అసిస్టెట్ అధికారి వల్లోజి శ్రీనివాసరావు, టీఎస్ స్టెప్ హైదరాబాద్ ప్రతినిధి మన్మోహన్ పాల్గొన్నారు.