ఖమ్మం :ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మిస్తున్నఆధునిక ఫుట్ పాత్ నిర్మాణ పనులను నగర మేయర్ పునుకొల్లు నీరజ గురువారం పరిశీలించారు. నగరంలోని వైరా రోడ్డులో ఉన్న అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటీ హబ్ సర్కిల్ వరకు నూతనంగా నిర్మిస్తున్న పుట్పాత్ పనులను మేయర్ పరిశీలించి గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని మరింత సుందరీకరించే లక్ష్యంతో మోడరన్ పుట్ పాత్ పనులను చేపట్టామన్నారు. ఈ పుట్పాత్ నిర్మాణాల వల్ల అందరికీ ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు.
ఖమ్మం నగరంలో అనేక చోట్ల పుట్ పాత్ లను నిర్మిస్తున్నామని అన్నారు. అనంతరం 59వ డివిజన్ దానవాయిగూడెంలో సీసీ రోడ్లు నిర్మాణానికి మేయర్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్ బట్టపోతుల లలితారాణి, 58వ డివిజన్ కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, స్వరూపరాణి దాదే సతీష్ తదితరులు పాల్గొన్నారు.