ఖమ్మం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ప్రతి ఒక్కరికీ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ వైధ్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. బుధవారం నగరంలోని ముస్తాఫానగర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు,సిబ్బంది గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సమయపాలపాటిస్తూ విధులకు హాజరవుతున్నారో లేదా అని ప్రశ్నించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎంత మందికి మొదటి డోసు, ఎంతమందికి రెండోవ డోసు వేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో రెండు డోస్లు వేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ తో పాటు మెడికల్ అధికారి జి.సౌమ్య, సిబ్బంది నీల వనిత, పద్మావతి, రమణ, పులిపాటి ప్రసాద్ తదితరులు ఉన్నారు.