ఖమ్మం : ఖమ్మం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)ఆధ్వర్యంలో 15-18 ఏండ్ల వారికి, 60 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్స్కు ,ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్ ను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ కోవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో 15 నుంచి 18 ఏండ్ల వయసున్న వారికి కూడా టీకాలు వేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం,ముస్తఫా నగర్, వెంకటేశ్వర నగర్, శ్రీనివాస నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టీకాను అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఉమెన్స్ కాలేజీ-గాంధీ చౌక్, ప్రభుత్వ పీజీ కాలేజీ-ఎన్ఠీఆర్ సర్కిల్, ప్రభుత్వ ఇందిరానగర్ స్కూల్-ఇందిరానగర్, శాంతినగర్ కాలేజీ-ముస్తఫా నగర్, అంబేద్కర్ గురుకుల కాలేజీ-ఎన్ ఎస్పీ క్యాంప్ లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఈసందర్భంగా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్, ఐఎంఏ సెక్రెటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.