కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 25: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జవాన్ను మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ గ్రామానికి చెందిన ఆసరామ్ కడ్తి.. రాజ్నందగావ్ జిల్లా డీఆర్జీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతడు ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టు పార్టీ స్మాల్ యాక్షన్ టీమ్ రంగంలోకి దిగింది.
ఆసరామ్ కోసం ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించింది. దేవాలయం వద్ద ఒంటరిగా దొరికిన ఆసరామ్పై ఆ యాక్షన్ టీం దాడి చేసి, చనిపోయాడనుకుని పారిపోయింది. అపస్మారక స్థితిలో పడిపోయిన జవాన్ను గ్రామస్తులు గమనించి, వెంటనే నెల్సనార్ పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనతో జగ్దల్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసరామ్ మృతి చెందాడు.
హెడ్ కానిస్టేబుల్ను హత్య చేసిన జవాన్..?
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న పురుషోత్తం సింగ్ అనే జవాన్.. తన సర్వీస్ రివాల్వర్తో, అక్కడి హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర భగత్ను కాల్చి చంపినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వర్తించే విషయమై వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్యకు కారణమని సమాచారం.