శ్రీరాంపూర్, డిసెంబర్ 1: సింగరేణి స్థలాల్లో ని వాసులకు ప్రభుత్వం అందించిన పట్టాలతో ప క్కా ఇండ్లు కట్టుకొని సంతోషంగా ఉంటున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పే ర్కొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16, 17 వార్డులు శ్రీరాంపూర్ ఆర్కే 6 గుడిసెల్లో నస్పూర్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు మేకల దాసు, తెనుగు లావణ్యతో కలిసి గురువారం ఇంటింటికీ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 70 మందికి ఇళ్ల్ల స్థలాల పట్టా లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం అ ధిక ప్రాధాన్యతనిస్తున్నదని చెప్పారు. ఇప్పటి వర కు 3500 మందికి పట్టాలు అందించామన్నారు.
తమకు కూడా పట్టాలు కల్పించాలని కోరుతూ కా లనీ వాసులు రావి కిషన్, మల్లయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సు రేందర్రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బండి పద్మ, బడికె లక్షి, పంబాల గంగాఎర్రయ్య, ఖాసీం, మ హిళా అధ్యక్షురాలు రౌతురజిత, మాజీ సర్పంచ్లు కమలాకర్రావు, గుంట జగ్గయ్య, నాయకు లు కాటం రాజు, చెల్ల విక్రం, గుమ్మడి శ్రీనివాస్, దగ్గుల మధు, గోపతి తిరుపతి, రవి, ఆకుల రమే శ్, రఫీఖ్ఖాన్, రవీందర్,రామన్న పాల్గొన్నారు.