ఖమ్మం, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రం వచ్చాకే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తితో కలిసి ప్రారంభించారు. తొలిరోజు షోకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేసిన 30కి పైగా స్టాళ్లను ప్రజలు సందర్శించి హౌజింగ్, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, యాక్ససిరీస్, అపార్ట్మెంట్స్ కొనుగోలుపై అవగాహన పెంచుకున్నారు. బ్యాంకర్లు రుణ సదుపాయాన్ని గురించి వివరించారు. ఇంత చక్కటి అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అతిథులు సూచించారు. షో ఏర్పాటు చేసిన ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ యాజమాన్యాలను అభినందించారు. కాగా, రెండో రోజు ఆదివారం జరిగే ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హాజరుకానున్నారు.
ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ వేదికగా శనివారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో ప్రారంభమైంది. తొలిరోజు షోకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేసిన 30కి పైగా స్టాళ్లను ప్రజలు సందర్శించి హౌజింగ్, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, యాక్ససిరీస్, అపార్ట్మెంట్స్ కొనుగోలుపై అవగాహన పెంచుకున్నారు. బ్యాంకర్లు రుణ సదుపాయాన్ని గురించి వివరించారు. తొలిరోజు షోను ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఇంత చక్కటి అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అతిథులు సూచించారు. షో ఏర్పాటు చేసిన ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ యాజమాన్యాలను అభినందించారు.
గతంలో హైదరాబాద్ వంటి మహానగరాలకు పరిమితమైన షోలు ఇప్పుడు ఖమ్మం నడిబొడ్డుకు తీసుకురావడాన్ని కొనియాడారు. తొలిరోజు ప్రాపర్టీ షోకు నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్ అధ్యక్షత వహించగా బ్రాంచ్ మేనేజర్ రేనా రమేశ్, ఎడిషన్ ఇన్చార్జి కాయల పూర్ణచందర్, డీజీఎం రాజిరెడ్డి, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్బాబు, సర్క్యులేషన్ ఏసీఎం రాంబాబు, యాడ్స్ సిబ్బంది నాగరాజు, వెంకన్న, సురేందర్రెడ్డి, సురేశ్, ఆర్సీ ఇన్చార్జి శీలం శ్రీనివాసరావు, రిపోర్టర్లు బోయిన కృష్ణ, పూనాటి మనోజ్, మద్దెల లక్ష్మణ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మంత్రి అజయ్కుమార్ వ్యక్తిగత సహాయకుడు సీహెచ్ రవికిరణ్, శ్రీబాలాజీ ఎస్టేట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వత్సవాయి రవి, శ్రీనిధి ఎన్క్లేవ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నం జగన్, ఖమ్మం వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షుడు నరేశ్, రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, కార్పొరేటర్ కమర్తపు మురళి, నాయకులు కుర్రా భాస్కర్రావు, కన్నం ప్రసన్నకృష్ణ, మాటేటి కిరణ్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా మంత్రిప్రగడ శ్రీనివాసరావు వ్యవహరించారు.
ఫంక్షన్ హాల్ కిటకిట..
ఖమ్మం నగరంతో పాటు హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు ఏర్పాటు చేసిన 30 స్టాళ్లను వందలాది మంది ప్రజలు సందర్శించారు. షోకు వచ్చిన వారితో ఫంక్షన్హాల్ నిండి కిటకిటలాడింది. ఒకే వేదికపై అనేక రకాల ప్రాపర్ట్సీస్కు సంబంధించిన వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు ఉండడంతో షోకు మంచి ఆదరణ లభించింది. బ్యాంకర్లు ఇండ్ల కొనుగోలు, నిర్మాణాలకు అందించే రుణాలపై సందర్శకులకు అవగాహన కల్పించారు. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టు డే’ యాజమాన్యాలకు వినియోగదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
నేడూ కొనసాగనున్న షో
రెండో రోజు ఆదివారం జరిగే ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రియల్ ఎస్టేట్ రంగం, ప్రభుత్వం రియల్టర్లకు అందిస్తున్న సదుపాయాలను వివరించనున్నారు.
సీఎం కేసీఆర్ విజన్తో రియల్ ఎస్టేట్కు ఆదరణ..
ప్రతిఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవడం కష్టతరమైనది. కల తీరాలంటే స్థలం ముందుగా సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. స్థలం సమకూర్చుకున్న తర్వాతే బ్యాంకులు రుణ సౌకర్యాన్ని కల్పిస్తాయి. గతంలో పాలకులు నగరాలు, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించలేకపోయారు. ఫలితంగా నగరాలు, గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తనదైన విజన్తో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. పరిపాలనను వికేంద్రీకరణ చేశారు. మౌలిక వసతులు కల్పించారు. దీంతో ప్రతి 30 కిలోమీటర్లకు ఒకచోట రియల్ ఎస్టేట్ రంగానికి ఆకర్షణ వచ్చింది. అక్కడ రియల్ ఎస్టేట్కు ఆదరణ పెరిగింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బీ పాస్ను తీసుకొచ్చి నిర్మాణాలకు సులువుగా అనుమతులు వచ్చేలా చేశారు. దీంతో వచ్చే వందేళ్లకు సరిపడా రియల్ ఎస్టేట్ రంగం నిలదొక్కుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు ప్రాపర్టీ షోను ఆదరించి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ చిరు ప్రయత్నాన్ని ఆశీర్వదించాలి.
–తిగుళ్ల కృష్ణమూర్తి, నమస్తే తెలంగాణ ఎడిటర్
స్వరాష్ట్రం వచ్చాకే రియల్ ఎస్టేట్కు మంచి రోజులు..
స్వరాష్ట్రం వచ్చాకే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నది. ఈ రంగంలో ఖమ్మం రాష్ట్రంలోనే టాప్-5లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతోనే రియల్ ఎస్టేట్కు డిమాండ్ పెరిగింది. కలెక్టరేట్, మెడికల్ కళాశాల నిర్మాణాలతో ఖమ్మం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక చొరవతో నగరం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. నిన్నమొన్నటి వరకు హైదరాబాద్కు పరిమితమైన ప్రాపర్టీ షోలు ఇప్పుడు ఖమ్మంలోనూ నిర్వహిస్తున్నాం. రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజాలైన సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ యాజమాన్యాలకు ప్రత్యేక అభినందనలు. భవిష్యత్తులోనూ భారీ స్థాయిలో ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా.
– తాతా మధు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
దిగ్విజయంగా రెండోసారి..
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ దిగ్విజయంగా రెండో సారి ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నది. జిల్లా ప్రజలకు ప్రాపర్టీ షో పరిచయం చేసి ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లపై అవగాహన కల్పిస్తున్న యాజమాన్యాలకు కృతజ్ఞతలు. యంత్రాంగం డీటీసీపీ కమిటీలు వేసి అనుమతులు ఇస్తున్నట్లు గానే ‘రేరా’ అనుమతులను జిల్లాలోనే ఇప్పించాలి. హైదరాబాద్ వెళ్లి అనుమతులు తెచ్చుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైంది. అధికారులు జిల్లాలోనే ఇన్స్పెక్షన్ చేసి ఖమ్మంలోనే అనుమతులు వచ్చేలా చూడాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీల పరిధిలో వెంచర్లు చేసి మిగిలిపోయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చెల్లించి ఉన్నాం. మా సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి.
– వత్సవాయి రవి, శ్రీబాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అధినేత
విజన్తోనే రియల్ ఎస్టేట్ బూం..
రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టితో టీఎస్ బీపాస్ అమలు చేస్తున్నది. దీంతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూం సాధ్యమైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో ప్లాట్లు, ఇళ్లకు అన్నిరకాల ప్రభుత్వ అనుమతులు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలే స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఆయా సంస్థల పరిధిలోని స్థిరాస్తులు, ప్లాట్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు మున్ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రజలు ప్రాపర్టీ షోను సద్వినియోగం చేసుకోవాలి. షో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థలకు కృతజ్ఞతలు.
– సురేందర్రావు, నమస్తే తెలంగాణ యాడ్స్ జీఎం
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
బ్యాంకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ‘నమస్తే’, ‘తెలంగాణ టు డే’ ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషదాయకం. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖమ్మం నగరం సమగ్రాభివృద్ధి సాధించడంతో నగర చుట్టుపక్కన ప్రాంతాల్లో ఎన్నో వెంచర్లు వెలిశాయి. భూమి ధరలు పెరిగాయి. ఇలాంటి సందర్భంలో కస్టమర్లు భూమి కొనడం లాభదాయకమే.
– పునుకొల్లు నీరజ, ఖమ్మం నగర మేయర్
చక్కటి వేదిక ప్రాపర్టీ షో..
ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రాపర్టీ షో ఎంతో ఉపయోగకరం. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విజన్తో ఖమ్మం నగరం సమగ్రాభివృద్ధి సాధించింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి పెట్టింది పేరుగా నగరం మారింది. ప్రజలు లేఅవుట్ల అనుమతులు పరిశీలించిన తర్వాతే ప్లాట్లు కొనుగోలు చేయాలి. బ్యాంకర్లు, రియల్టర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ప్రాపర్టీ షో నిర్వహించడం హర్షణీయం.
– విజయ్కుమార్, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్
అనుమతులు సులభతరం చేయాలి..
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేస్తున్న వెంచర్లకు అధికారులు సత్వరం అనుమతులు మంజూరు చేయాలి. సులభమైన పద్ధతిలో అనుమతులు వచ్చేలా చూడాలి. రియల్టర్లు సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలంటే ఇబ్బంది. అప్పటికే పెట్టుబడి పెట్టి కుదేలయ్యే పరిస్థితులు వారికి ఎదురుకావొద్దు. రియల్టర్లూ కొనుగోలుదారులనూ ఇబ్బందులకు గురిచేయొద్దు.
– కూరాకుల నాగభూషణం, డీసీసీబీ చైర్మన్
కస్టమర్లకు మంచి అవకాశం..
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ వరుసగా రెండోసారి ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నది. కస్టమర్లకు ఇది చక్కటి అవకాశం. వారు ప్రాపర్టీ షోకు వచ్చి స్థిరాస్తుల కొనుగోళ్లపై అవగాహన పెంచుకోవచ్చు. డీటీసీపీ అనుమతులు పొందిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎలాంటి నష్టం ఉండదు. సుడా ఏర్పాటైన తర్వాత మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ డీటీసీపీ లే అవుట్లపై అనేకసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నాన్ డీటీసీపీ లేఅవుట్లు ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేవు.
– ఉన్నం జగన్, శ్రీనిధి ఎన్క్లేవ్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్