అన్నపురెడ్డిపల్లి, నవంబర్ 24: కార్తీక మాస పాడ్యమి పురస్కరించుకొని గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం, శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో జ్యోతులను వెలిగించి, పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం శివన్నామ స్మరణతో మార్మోగింది. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
అశ్వారావుపేట రూరల్, నవంబర్ 24: కార్తీక మాసం చివరి రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మండలంలోని మల్లికార్జునస్వామి, యంత్ర రాజసహిత ఆలయం, రమా సత్యనారాయణస్వామి, ఆదిపరాశక్తి, శ్రీకృష్ణ ఆలయాల్లో భక్తులు తెల్లవారు జాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. అరటి దొప్పల్లో వత్తులు వెలిగించి నీళ్లలో వదిలారు.
అశ్వారావుపేట టౌన్, నవంబర్ 24: పట్టణంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాస పాఢ్యమిని పురస్కరించుకుని బాబాకు అభిషేకాలు, అలంకరణ చేశారు. మహిళలు స్వామివారి సన్నిధికి చేరుకుని పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
దమ్మపేట, నవంబర్ 24: దమ్మపేటలోని పలు ఆలయాల్లో మహిళలు కార్తీకమాసం ముగియడంతో కార్తీక పూజలు నిర్వహించారు. ఇంటి వద్ద తులసిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి సమీపంలోని ఆలయాలకు వెళ్లి కార్తీకదీపాలు వెలిగించారు. కార్తీకమాసం చివరి రోజు కావడంతో మహిళలు, భక్తులు కార్తీకపూజలు నిర్వహించారు.