సత్తుపల్లి టౌన్/వేంసూరు, ఫిబ్రవరి 11: కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ మంగళవారం నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.