టేకులపల్లి, నవంబర్ 27: మొక్కజొన్నల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది.
గంగారం పంచాయతీ పరిధిలోని సిద్ధారం సమీపాన దయ్యాల లొద్ది వద్ద ఆళ్లపల్లి నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.