భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని దేశంలోనే మేటి సంస్థగా నిలుపుదామని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో సింగరేణీయులకు పిలుపుని చ్చారు. సింగరేణీయులు కష్టపడి పనిచేసి సంస్థ పరిధిలో మరిన్ని థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు విస్తరింప జేయాలన్నారు. రాష్ట్రంలోని థర్మల్, విద్యుత్ కేంద్రాలన్నింటికీ బొగ్గు కొరత లేకుండా సరఫరా చేయడానికి సంసిద్ధంగా ఉండాలన్నారు. గనుల్లో ప్రతిఒక్కరూ రక్షణ నియమాలను పాటించాలన్నారు.
సీఎండీగా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు కృతజ్ఞతలు తెలుపుకుంటు న్నానన్నారు. ఆయనకు సింగరేణి మాజీ డైరెక్టర్ (పా) పవిత్రన్కుమార్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ చైర్మన్, కోలిండియా డైరెక్టర్ (టెక్నికల్) వీరారెడ్డి, సింగరేణి డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, ఈడీ కోల్మైమెంట్ ఆల్విన్, జీఎం (కో-ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (సేఫ్టీ) గురవయ్య, సింగరేణి అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్వీకే రాజశేఖర్రావు అభినందనలు తెలియజేశారు.