ఖమ్మం, అక్టోబర్ 7: హామీలు నెరవేర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలందరూ అం డగా నిలవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేవారు. ఖమ్మంలో శనివారం పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో రూ.11.61 కోట్లతో 8 బ్లాకుల్లో నిర్మించిన 192 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఇక్కడి ప్రజల అభ్యర్థన మేరకు దానవాయిగూడెం ప్రధాన రోడ్డు నుంచి మల్లెమడుగు వరకూ సీసీ రోడ్డు మంజూరు చేస్తామని, నేరుగా వచ్చేందుకు ఆర్వోబీను కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని అన్నారు.
ఖమ్మాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో శనివారం పర్యటించిన ఆయన.. వివిధ డివిజన్లలో రూ.7.85 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వీపీ గౌతమ్తోపాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ సురభి, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, స్వామి, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, సునీల్రెడ్డి, బుడిగెం శ్రీను, తోట గోవిందమ్మ రామారావు, మాటేటి అరుణ, ధనాల రాధ, చావా మాధురి, నాగండ్ల కోటి, దండా జ్యోతి రెడ్డి, శ్రీనివాస్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కొమరయ్య, మేకల సుగుణారావు, ధనాల శ్రీకాంత్, పాలడుగు పాపారావు, కొప్పెర నర్సింహారావు, ఎర్రా అప్పారావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.