చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలెత్తుకొని జీవిస్తున్నారని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. చింతకాని సోసైటీ కార్యాలయ ఆవరణలో నూతనంగా రూ.65లక్షలతో నిర్మించనున్న గిడ్డంగికు శంఖుస్ధాపన చేశారు. సోసైటీ చైర్మన్ కొండపల్లి శేఖర్రెడ్డి అధ్యక్షతన పీఏసీఎస్లో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడూతూ ఒక రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేవలం పరిశ్రమల స్ధాపన ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ది చెందిందని కేంద్రం, పలు స్వచ్చంధ సంస్ధలు సర్టిఫికెట్ ఇవ్వడం షరామామూలే కానీ ఎన్నెన్నో కలలు, ఆకాంక్షల నడుమ కేంద్రంపై పోరాడి తెచ్చుకున్న ఆశల తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో నంబర్ వన్ స్ధానంలో దూసుకుపోవడమే కాక వినూత్నంగా వ్యవసాయానికి ప్రాధాన్యత నివ్వడం ద్వారా రాష్ట్రంలో సబ్బండ వర్గాలు ఫుల్ జోష్తో ఉన్నాయన్నారు.
ప్రతిపక్షాలు సైతం ముక్కున వేలు వేసుకోనే విధంగా రైతు సంక్షేమ పధకాలు అమలు చేయడం కేవలం కేసీఆర్కు మాత్రమే సాధ్యమని, ప్రతిపక్షాల విమర్శలకు, ధర్నాలకు, రాస్తారోకోలకు ఎంతమాత్రం చోటివ్వకుండా ఉండడం కేసిఆర్ పరిపాలన దక్షత మార్క్కు నిదర్శనమని వారు కోనియాడారు. అనంతరం సోసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో ముగ్గురు చైర్మన్లను ఘనంగా సన్మానించారు. ఇదే ఆవరణలో హరితహరం కార్యక్రమంలో భాగంగా పలు మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు, రైతుసమన్వయసమితి సభ్యులు కిలారు మనోహర్, పెంట్యాల పుల్లయ్య, మంకెన రమేశ్, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీడీవో రవికుమార్, జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, వైస్ఎంపీపీ గురజాల హనుమంతరావు, సర్పంచ్లు బండి సుభద్ర, కాళంగి లలిత, చాట్ల సురేశ్, కాండ్ర పిచ్చయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్లమోతు శేషగిరి, నూతలపాటి వెంకటేశ్వరరావు, పఠాన్ షబ్బీర్ఖాన్, బోడ్డు వెంకట్రామారావు, గడ్డం శ్రీను, ఆలస్యం శంకర్, నన్నక కోటయ్య, వేముల నర్సయ్య, చల్లా అచ్చయ్య, డైరక్టర్లు, సీఈవో శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీముఖ్య నాయకులు పాల్గొన్నారు.