పాల్వంచ, ఫిబ్రవరి 26 : జిల్లా ఇండస్ట్రీయల్ క్రికెట్ టోర్నమెంట్ అశ్వాపురం హెవీవాటర్ప్లాంట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగింది. ఈ పోటీల్లో సింగరేణి, నవభారత్, కేటీపీఎస్ 5,6,7 దశలు, మణుగూరు బీటీపీఎస్, ఐటీసీ సారపాక, హెవీవాటర్ప్లాంట్ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్లో కేటీపీఎస్ 7వ దశ క్రికెట్ క్రీడాకారులు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. టోర్నమెంట్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు ఎండీ ఆరీఫ్, ఎం.శ్రీనివాస్, రమేష్, నరసింహారావు, మహేష్, వివేక్, రంగానాయక్, జి.లక్ష్మణ్రావు, ఎండీ ముక్తార్ అహ్మద్, బాను మహేష్, రమేష్, శ్రీనివాస్, రాహుల్, భరత్కుమార్, సతీష్కుమార్, డి.మహేష్లను సీఈ వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈ ఎస్ఎన్ఎస్ శేఖర్, వై.వెంకటేశ్వర్లు, శేఖర్, వై.వెంకటేశ్వర్లు, ఎన్ఎల్కే ప్రసాద్లు పాల్గొన్నారు.