అందరి నోట.. ఇదే మాట
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్లి రాణించాలని, దేశాభివృద్ధికి సేవలు అందించాలని ప్రజలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు.. బీజేపీ పాలనలో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని, కేసీఆర్ లాంటి విజన్ఉన్న నేత కావాలని కోరుకుంటున్నారు..
యావత్ భారత ప్రజలకు మేలు..
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశిస్తే యావత్ భారత ప్రజలకు మేలు జరుగుతుంది.. ఇప్పటికే ముఖ్యమంత్రిగా తెలంగాణను అభివృద్ధికి రోల్మోడల్గా తీర్చిదిద్దిన కేసీఆర్కు దేశ స్థితిగతులను మార్చగల సత్తా ఉంది. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించే విజన్ ఉన్న వ్యక్తి. ఆయన నాయకత్వాన్ని యువత ఆహ్వానిస్తున్నది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగల సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్. ఆయనకు ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలి.
– రేగా కాంతారావు, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
ప్రజాస్వామ్య పరిరక్షణ కేసీఆర్తోనే సాధ్యం
జాతీయస్థాయి రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొచ్చే సత్తా కేసీఆర్కు ఉంది. దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసిన బీజేపీని తరిమికొట్టగల నాయకుడి కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారికి సీఎం కేసీఆర్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసి నైతిక విలువలను కాలరాసిన బీజేపీని హిందూ మహాసముద్రంలో విసిరేయాలని ఇటీవల కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి..
– టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు