ఖమ్మం: టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పిలుపినిచ్చారు. మంగళవారం ఖమ్మం నగరంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో నగర అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, టీఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్లు మాట్లాడారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అభివృద్ది కార్యక్రమాలను అందరికీ అందించాలన్నారు.
స్థానికంగా ఉన్న ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించి మరణించిన వారి పేర్లు, డబుల్ ఉన్న పేర్లను, గుర్తించి తొలగించేందుకు ధరఖాస్తులు చేయాలని అన్నారు.18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా మంత్రి అజయ్కుమార్ ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా కార్యకర్తలు పనిచేయాలని అన్నారు.
ఎలాంటి ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చేలా అందరూ పనిచేయాలని పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, పార్టీ నగర కార్యదర్శి ఇసాక్, కార్పోరేటర్లు కమర్తపు మురళి, మందడపు లక్ష్మి, ఎండీ మక్బుల్, షౌకత్ అలీ, దాదే అమృతమ్మ, రోజ్లీనా, పాకాలపాటి విజయనిర్మల, వేడారపు వెంకటేశ్వర్లు, మడూరి ప్రసాద్, ఖమ్మం నగర ప్రచార కార్యదర్శి షకీనా, తదితరులు పాల్గొన్నారు.