ఖమ్మం, సెప్టెంబర్ 28: టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పగడాల నాగరాజు జన్మదిన వేడుకలు బుధవారం ఖమ్మంలో జరిగాయి. పగడాల అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పలు చోట్ల వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్ఎస్పీ క్యాంపులోని ఫ్రీడం పార్కులో అభిమానులు, కార్యకర్తల మధ్య పగడాల నాగరాజు కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. ఈ సందర్భంగా పగడాల నాగరాజు, శ్రీవిద్య దంపతులను పూలమాలతో సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రక్తదానం చేశారు. అన్నం ఫౌండేషన్లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. బల్లేపల్లి మదర్ థెరిస్సా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు.
మంత్రి అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, రాపర్తి శరత్, తోట రామారావు, కన్నం ప్రసన్న కృష్ణ, బుర్రి వెంకట్కుమార్, అశ్రిఫ్, రుద్రగాని ఉపేందర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు షేక్ అఫ్జల్హసన్, బీసీ సంఘ అధ్యక్షుడు మేకల సుగుణరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు హెచ్ ప్రసాద్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు వాంకుడోత్ సురేశ్, చిన్న నాగరాజు, అబ్బాస్, దడవాయి, హమాలీ, సంఘ నాయకులు తదితరులు పగడాల గృహానికి వచ్చి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.