వైరా టౌన్, అక్టోబర్ 21 : యాదవ, కురుమల ఆర్థిక అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శుక్రవారం వైరాలోని స్థానిక మార్కెట్ యార్డ్లో మండల యాదవ, కురుమ సంఘం ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించారు. ముందుగా అయ్యప్పస్వామి ఆలయం నుంచి మార్కెట్యార్డు వరకు ద్విచక్ర వాహన భారీ ర్యాలీ నిర్వహించారు. సభలో బాలరాజు యాదవ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీలో మార్పు చేసి నగదు బదిలీ చేసేందుకు నల్లగొండ, భువనగిరి జిల్లాలను పైలెట్ ప్రాజెక్ట్గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సుమారు 74 రకాల ఉత్పత్తులకు సంబంధించిన రుణాలను కోటి రూపాయల వరకు ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, యాదవులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 23వ తేదీన ఖమ్మంలో జరిగే జిల్లా మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గోసు మధు, గుమ్మా రోశయ్య, అల్లిక కాటన్రాజు, మధురయ్య, ఇమ్మడి రామారావు, జవ్వాజి కృష్ణయాదవ్, తోటకూర వీరబాబు పాల్గొన్నారు.
మరికొద్ది రోజుల్లో రాయితీ గొర్రెల రెండో విడత పంపిణీ ప్రారంభమవుతుందని రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన చైర్మన్ను డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సత్కరించారు. బాలరాజు మాట్లాడుతూ రెండో దశలో యూనిట్ విలువ రూ.50 వేలు పెంచారని, లబ్ధిదారుడు రూ.43,750 డీడీ తీస్తే రూ.1.75 లక్షలను నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట చంద్రుగొండ గుంపెన సొసైటీ చైర్మన్ సుధాకర్రావు, డీసీసీబీ సీఈవో వీరబాబు ఉన్నారు.