భద్రాచలం, అక్టోబర్ 4: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలు, తులసి మాలలు, నారీకేళ జలాలతో విశేష అభిషేక తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు ‘మహలక్ష్మీ’ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాలు ముగియడంతో లక్ష్మీతాయారు అమ్మవారు బుధవారం నిజరూపలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నేడు దసరా పండుగ
బుధవారం దసరా పండుగ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే రామయ్యకు పట్టాభిషేకం జరుపనున్నారు. సాయం త్రం దసరా మండపం వద్ద విజయోత్సవ వేడుకలు, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామ్ లీలా మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.