మామిళ్లగూడెం, సెప్టెంబర్ 26: జీవో 59 అమలుకు చేపడుతున్న సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ‘59 జీవో అమలు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిషారం’పై ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో కలెక్టరేట్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉత్తర్వులపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ధరణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మిస్సింగ్ సర్వే నెంబర్ దరఖాస్తుల పరిషారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వినతుల రిజిస్టర్ నిర్వహించాలని, వాటిని నమోదు చేసి వాటి పరిస్థితి విషయమై ఎప్పటికప్పుడు అప్డేట్ అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవో రవీంద్రనాథ్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గురుకులాలు, వసతిగృహాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల గురుకులాలు, సాధారణ గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల సిబ్బందికి ఈ నెల 27 నుంచి 30 వరకు నగరంలోని అల్లీపురం రోడ్డులో ఉన్న తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో శిక్షణ తరగతులు ఉంటాయని వివరించారు. వివరాల కోసం మైనార్టీ బాలికల-2 పాఠశాల ప్రిన్సిపాల్ సీతామహాలక్ష్మిని సంప్రదించాలని తెలిపారు.
గ్రీవెన్స్ వినతుల స్వీకరణ..
గ్రీవెన్స్ వినతుల పరిషారానికి అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారం కోసం వాటిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు.
యూనిట్లు గ్రౌండింగ్ చేయాలి..
దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ను అధికారులు వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన దళితబంధు కోర్ కమిటీ సమావేశంలో చింతకాని మండల దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై కలెక్టర్ సమీక్షించారు.