ముదిగొండ, సెప్టెంబర్ 20: హైవే నిర్మాణ పనులు త్వరత్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. మండలంలోని న్యూలక్ష్మీపురం, వెంకటాపురం, గోకినేపల్లి గ్రామాల పరిధిలో నిర్మాణంలో ఉన్న 365/ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. కాంట్రాక్టర్, హైవే అధికారులను వివరాలు అడిగి తెలసుకున్నారు. అక్కడక్కడ నిర్మాణాలు ప్రారంభం కాకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనుల్లో అలసత్వం వహించొద్దని ఆదేశించారు. పలువురు రైతులు, భూ నిర్వాసితులు పరిహారం, గతంలో కంటే ఎక్కువ భూమి తీసుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శిరీష, ఎంపీడీవో శ్రీనివాసరావు, హైవే అధికారులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, సెప్టెంబర్ 20: గువ్వలగూడెం నుంచి పైనంపల్లి వరకు చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. గువ్వలగూడెం వద్ద పలువురు రైతులు కలెక్టర్ను కలిసి తమ భూములను జాతీయ రహదారి పనులకు ఇచ్చామన్నారు. అందులో తమకు కొంత భూమి ఉన్నదని, ఆన్లైన్లో భూమి ఎన్హెచ్కు రెండుసార్లు కేటాయించినట్లు వస్తున్నదని తెలిపారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, ఎన్హెచ్ పీడీ దుర్గాప్రసాద్, ఈఈ సమ్మిరెడ్డి, డీఈ మన్మధరావు, పవర్మెక్ ప్రతినిధి సత్యనారాయణ, ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ ప్రసాదు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 20: రహదారి విస్తరణ పనులు నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ వీ పీ గౌతమ్ అన్నారు. వెంకటగిరి ప్రాంతంలో జరుగుతున్న ఖమ్మం-కోదాడ రహదారి విస్తరణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఖమ్మం-కోదాడ నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు చేపట్టామన్నారు. హైవే పొడవు 21.7 కిలోమీటర్లు, బైపాస్ పొడవు కిలోమీటర్లు, 15 నేలకొండపల్లి పరిధిలో 5.3కిలోమీటర్లు, గోకినపల్లి పరిధిలో 2.7 కిలోమీటర్లు, ముదిగొండ పరిధిలో 7 కిలోమీటర్లు ఉందన్నారు. రహదారిపై ఒక మేజర్ వంతెన, 9 మైనర్ వంతెనలు ఉన్నాయన్నారు. 7 మైనర్ వంతనలు, 7 వీయూపీ, 29బాక్స్ కల్వర్టులు నిర్మాణ ప్రగతిలో ఉన్నాయన్నారు. మిగులు పనులు త్వరితగతిన ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ మధుసూదన్, నేషనల్ హైవే పీడీ దుర్గాప్రసాద్, మేనేజర్ పద్మ, తహసిల్దార్ సుమ, ఎంపీడీవో అశోక్కుమార్, విద్యుత్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.