సత్తుపల్లి రూరల్, సెప్టెంబర్ 19: టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నందున ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఆయనకు అండగా ఉండి ఆశీర్వదిస్తేనే మున్ముందు మరిన్ని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. మండలంలోని నారాయణపురం, కిష్టాపురం, రేజర్ల, కొత్తూరు, గౌరిగూడెంలో సోమవారం పర్యటించిన ఆయన.. ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించి సింగరేణి ప్రభావిత గ్రామాలైన రేజర్ల, కొత్తూరులోని నిర్వాసిత రైతులకు ఎకరానికి రూ.25 లక్షల పరిహారాన్ని మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు.
సింగరేణి బ్లాస్టింగ్తో గృహాలు దెబ్బతిన్నందున వాటి యజమానులు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకునేందుకు త్వరలోనే ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. రూ.75 లక్షల సింగరేణి నిధులతో రేజర్లలో కల్యాణమండపం నిర్మిస్తున్నామన్నారు. ప్రజల తాగునీటి సౌకర్యార్థం రెండు వాటర్ప్లాంట్లు నిర్మించి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తొలుత ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులు, మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యే సండ్రకు వర్షంలోనూ బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు, వీరేశం, కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దొడ్డా హైమావతి, కూసంపూడి రామారావు, దేశిరెడ్డి రంగారెడ్డి, పుల్లమ్మ, జక్కుల ప్రభాకర్రావు, ఒగ్గు విజయలక్ష్మి, మందపాటి శ్రీనివాసరెడ్డి, తుంబూరు కృష్ణారెడ్డి, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, చింతల సురేందర్రెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి (ఎర్రబాబు), భీమిరెడ్డి గోపాలరెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, జగ్గారెడ్డి, రామ్మోహనరెడ్డి, పెద్దిరెడ్డి పురుషోత్తం, మేకా సతీశ్రెడ్డి, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, బాలాజీరెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, పొన్నగంటి జోగారావు, మేడా జగ్గారావు, బొంతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీఎం ఫ్లెక్సీకి పుష్పాభిషేకం
సత్తుపల్లి రూరల్, సెప్టెంబర్ 19: 57 ఏళ్లు నిండిన అర్హులకు ఆసరా పింఛన్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో మండలంలోని లబ్ధిదారులు సోమవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. మండలంలోని కొత్తూరులో గ్రామంలో ఉన్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆసరా పింఛన్ మంజూరు కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర సమక్షంలో సర్పంచ్ ఒగ్గు విజయలక్ష్మి, ఆసరా పింఛన్ల లబ్ధిదారులు, గ్రామస్తులు కలిసి ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దిరెడ్డి పురుషోత్తం, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, కొప్పుల నరేందర్రెడ్డి, జగ్గారెడ్డి, సతీశ్రెడ్డి, భాగ్యలక్ష్మి, సావిత్రి, రవీంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, మేకా చెన్నారెడ్డి, సోమిరెడ్డి, భీమిరెడ్డి సుధాకర్రెడ్డి, ఫణికుమార్, రవి, వేణు, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నారాయణపురంలో బతుకమ్మలతో ఎమ్మెల్యే సండ్రకు స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు