కవులు, కళాకారులకు సన్మాన మహోత్సవం.. నృత్యకారుల నాట్య విన్యాసం.. ‘జబర్దస్త్’ కళాకారుల హాస్యవల్లరి.. గాయకుల సంగీత విభావరి.. వెరసి.. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు గ్రాండ్ సక్సెస్.. ఆదివారం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన వేడుకకు ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, నగర మేయర్ నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. కొత్తగూడెం వేడుకలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు..
– ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 18
హాస్య నాటికలో హైపర్ ఆది నటించిన సన్నివేశం..
ఖమ్మంలో వేడుకను వీక్షిస్తున్న నగరవాసులు