ప్రజలందరూ ఆనందోత్సహాలతో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పిలుపునిచ్చారు. 14 రోజుల వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో సీపీతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. ఈ నెల 22 వరకు 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సినిమా హాళ్లలో ‘గాంధీ’ చిత్రాన్ని చూపిస్తామన్నారు. 15న ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 10 వేల మందితో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.
ఖమ్మం, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలందరి ఆనందోత్సహాలతో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సంబురాలు అంబరాన్నంటాలని, 14 రోజుల వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికాబద్ధంగా వేడుకలను విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ సోమవారం ప్రజాప్రతినిధుల సమక్షంలో వజ్రోత్సవాలను అధికారికంగా ప్రారంభించారన్నారు. షెడ్యూల్ ప్రకారం రెండు వారాలపాటు జిల్లాలో వేడుకలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, గ్రామదీపికలు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీల సిబ్బంది సహకారంతో ప్రతి ఇంటికీ జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ నెల 11లోగా దానిని పూర్తి చేస్తామన్నారు.
పంపిణీ చేసిన జాతీయ జెండాలను జాతీయ జెండా ఫ్లాగ్ కోడ్ పాటించి ఈ నెల 13న ఉదయం 9 గంటల వరకు ప్రజలందరూ తమ నివాస, వ్యాపార కేంద్రాలపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15న సాయంత్రం 5 గంటలలోపు దానిని అవతనం చేయాలని సూచించారు. ఈ నెల 22 వరకు 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సినిమా హాళ్లలో ‘గాంధీ’ చిత్రాన్ని చూపిస్తామన్నారు. మొదటి రోజున జిల్లాలో 16 సినిమా హాళ్లలో 8,517 మంది విద్యార్థులు ఈ సినిమాను వీక్షించారన్నారు. మంగళవారం గుర్తించిన 67 ప్రాంతాల్లో బుధవారం అధికారులు వనమహోత్సవంలో పాల్గొని మొకలు నాటాలన్నారు. 11న క్రీడాకారులు, యువతీయువకులు స్వచ్ఛందంగా ఫ్రీడమ్ రన్లో పాల్గొనాలన్నారు.
13న విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, ఎన్జీవోలు కళా ప్రదర్శనలు నిర్వహిస్తారన్నారు. 14న తెలంగాణ సాంసృతిక సారథులతోనూ జాతీయభావం పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 15న ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 10 వేల మంది ప్రజలతో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 16న జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఒకే సమయంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉంటున్నారు. 17న రక్తదాన శిబిరాలు, 18న క్రీడాపోటీలు, 19న ఆసుపత్రులు, ఆశ్రమాల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాలు, 20న గ్రామాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు, 21న ప్రత్యేక సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 22న అన్ని మండల కేంద్రాల్లో, ఖమ్మంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో ముగింపు వేడుకలు ఉంటాయని తెలిపారు.
ఫ్లాగ్ కోడ్ పాటించాలి
ఖమ్మం సీపీ విష్ణు మాట్లాడుతూ పటిష్ట కార్యాచరణతో వేడుకలు చేపటేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2022 ముఖ్య అంశాలను ప్రజలు పాటించాలని సూచించారు. మన జాతీయ జెండా.. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తుందని గుర్తుచేశారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా – 2002 ప్రకారం పాలిస్టర్ లేదా మెషీన్ మేడ్ ఫ్లాగ్తో తయారు చేసిన జాతీయ జెండాను అనుమతించినట్లు చెప్పారు. చేతితో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి, పాలిస్టర్, ఉన్ని, సిల్, ఖాదీ వంటి వాటితో తయారు చేసినవి మాత్రమే వినియోగించాలన్నారు. దెబ్బతిన్న, చిరిగిన జెండాలను ప్రదర్శించకూడదని సూచించారు.