భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఎందరో స్వాతంత్ర సమరయోధులు.. విప్లకారుల త్యాగఫలమే భారతదేశానికి స్వాతంత్య్రం.. మనల్ని మనం పాలించుకునే ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడి ఇప్పటికి 75 ఏళ్లు. మనకు వజ్రోత్సవం. ఈవేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. స్వాతంత్య్ర ద్విసప్తాహం పేరుతో రెండు వారాల పాటు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నది. ఇప్పటికే ఉత్సవాలపై భద్రాద్రి కలెక్టర్తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ ఔన్నత్యం, స్వాతంత్ర సమరయోధుల గాథలను ప్రజలు, విద్యార్థులకు తెలిసేలా కవి సమ్మేళనాలు, వ్యాస రచన, వక్తృత్వ, ముగ్గుల పోటీలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాయంత్రాంగం ఈనెల 8 నుంచి 22 వరకు పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
8 నుంచి 22 వరకు కార్యక్రమాలు ఇలా..
ఘనంగా వేడుకలు..
స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలను ఎంత అట్టహాసంగా నిర్వహిస్తామో ముగింపు వేడుకలనూ అంతే బాగా నిర్వహిస్తాం. గ్రామగ్రామాన దేశభక్తిని చాటేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం. సినిమా థియేటర్లలోనూ సమరయోధుల సినిమాలను ప్రదర్శిస్తాం. దేశభక్తిని చాటేలా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తాం.
– భద్రాద్రి కలెక్టర్ అనుదీప్