రఘునాథపాలెం, ఆగస్టు 7 : కోతల్లేకుండా 24గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 15వ డివిజన్ అల్లీపురంలో 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ర్టానికీ సాధ్యం కాని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరాయంగా అన్ని రంగాలకు విద్యుత్ అందిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి 24గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కోతల్లేని కరెంట్ అందించాలనే ఉద్దేశంతో సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఏ సురేందర్, డీఈలు రాములు నాయక్, బాబురావు, ఏఈ అశోక్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మేదరమెట్ల శైలజ, గిర్దావర్ రవి, కార్పొరేటర్ రావూరి కరుణ, టీఆర్ఎస్ నాయకులు సంక్రాంతి నాగేశ్వరరావు, రావూరి సైదుబాబు, మొర్రిమేకల కోటయ్య, ముప్పారపు ఉపేందర్రావు, చేతుల తిరుపతిరావు, నాగేశ్వరరావు, సామినేని రాంబాబు, పత్తిపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.