మామిళ్లగూడెం/కొత్తగూడెం క్రైం, ఆగస్టు 6: ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 13,236 మంది అభ్యర్థులు పరీక్ష రా యనున్నారు. అందుకు గాను ఖమ్మం నగరంలో 17 కేంద్రాలు, సత్తుపల్లిలో 13 కేంద్రాలు ఏర్పాట య్యాయి. ఖమ్మం నగరంలోని కేంద్రాల్లో 7,932 మంది, సత్తుపల్లి కేంద్రాల్లో 5,304 మంది పరీక్ష రా యనున్నారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఉంటుందని పరీక్షల కో-ఆర్డినేటర్లు తెలిపారు. 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు.
భద్రాద్రి జిల్లాలో..
కొత్తగూడెంలోని 14 పరీక్షా కేంద్రాల పరిధిలో 6,108 మంది, భద్రాచలంలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో 2,044 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. బయోమెట్రిక్ విధానంలోనే అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. పరీక్షకు నోడల్ అధికారిగా ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, కొత్తగూడెం-పాల్వంచలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు మైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పున్నం చందర్, భద్రాచలంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ భద్రయ్య రీజినల్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 21 పరీక్షా కేంద్రాలకు 21 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 21 మంది అబ్జర్వర్లు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు, కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వరబాబు, ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి, డీసీఆర్బీ డీఎస్పీ బానోత్ నందిరామ్ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. సుమారు 20 మంది ఇన్స్పెకర్లు, ఆరుగురు ఆర్ఐలు, 30 మంది ఎస్సైలు, 150 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తారు.
పరీక్షకు భారీ బందోబస్తు
ఖమ్మం జిల్లాలో ఎస్ఐ ఉద్యోగాలకు జరుగుతున్న ప్రాథమిక పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలు ఉన్న సత్తుపల్లి, ఖమ్మంలలో పటిష్ట బందోబస్తుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బందోబస్తులో ఏడుగురు ఏసీపీలు, 15 మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు, 40 మంది ఏఎస్ఐలు/ హెడ్ కానిస్టేబుళ్లు, 120 మంది కానిస్టేబుళ్లు, 25 మంది మహిళా కానిస్టేబుళ్లు, 45 మంది హోంగార్డులు బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు.
అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవే..