ములకలపల్లి, జూలై 2: సీతారామ ప్రాజెక్టు పరిసరాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పూసుగూడెం పంచాయతీ పరిధిలోని వీకే రామవరం వద్ద చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్ పనులను పరిశీలించి మాట్లాడారు. పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. వేప, విప్ప, నారవేప, గానుగ, జిట్రేగి, వెలగ, మారేడు వంటి అడవి జాతి మొక్కలు నాటించాలని ఎంపీడీవో నాగేశ్వరరావును ఆదేశించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ప్రాజెక్టు పనులు, ట్రయల్న్ప్రై నీటి పారుదల, ఇంజినీరింగ్శాఖ అధికారులను ఆరా తీశారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ ఈఈ అర్జున్, డీఈలు మోతీలాల్, రాంబాబు, డీఆర్డీఏ పీడీ మధుసూదన్రాజు, ఏఈలు గఫూర్పాషా, వరప్రసాద్, సుబ్బరాజు, జడ్పీటీసీ సున్నం నాగమణి, సర్పంచ్ బానోత్ విజయ ఉన్నారు.