ఖమ్మం, జూలై 2: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. చింతకాని మండలంతోపాటు జిల్లాలోని లబ్ధిదారులకు మంజూరైన దళితబంధు యూనిట్లను త్వరతిగతిన గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడారు. యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. లబ్ధిదారులకు లాభసాటిగా ఉండే యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించాలన్నారు. ఎంచుకున్న యూనిట్ను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్లో నిలదొక్కుకొని ఆర్థికాభివృద్ధి సాధించేలా లబ్ధిదారులను చైతన్యపర్చాలని ఆదేశించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్వో శిరీష, జడ్పీ సీఈవో అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు, డీఏవో విజయనిర్మల, డీటీవో కిషన్రావు, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ పాల్గొన్నారు.