ఖమ్మం/ రఘునాథపాలెం, జూలై 1: సామాన్యుడికి మెరుగైన వైద్యసేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని 16వ డివిజన్ ధంసలాపురంలో రూ.16 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 33వ డివిజన్ గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.40 లక్షలతో నిర్మించిన 4 అదనపు గదులను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చి కార్పొరేట్ స్థాయికి మించి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తోందని అన్నారు.
అందుకోసమే ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, డీఈవో యాదయ్య, డీఆర్డీవో విద్యాచందన, కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు, దోన్వాన్ సరస్వతి, మక్బుల్, టీఆర్ఎస్ నాయకులు ఆళ్ల అంజిరెడ్డి, ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘పాలెం’లో ఆరోగ్య ఉప కేంద్రం
రఘునాథపాలెంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి మంత్రి అజయ్కుమార్ ప్రారంభించారు. వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, సర్పంచ్ గుడిపుడి శారద, ఉప సర్పంచ్ కుందేసాహెబ్, డీపీవో హరిప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, మాజీ వైస్ చైర్మన్ మందడపు నర్సింహారావు, టీఆర్ఎస్ నాయకులు గుడిపూడి రామారావు, నల్లమోతు శ్రీనివాసరావు, నంద్యా, గొర్రె శ్రీనివాసరావు, మందడపు బ్రహ్మారెడ్డి, రావూరి సైదుబాబు, సంక్రాంతి నాగేశ్వరరావు, కార్పొరేటర్లు రావూరి కరుణ, మేడారపు వెంకటేశ్వర్లు, ఆళ్ల నిరీషా అంజిరెడ్డి, మంచుకొండ వైద్యురాలు స్రవంతి, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.