సారపాక, జూన్ 28: సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్వన్గా నిలిచిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండి, మోతేపట్టీనగర్, కోయతగూడెం, తాళ్లగొమ్మూరు పంచాయతీల్లో రూ.60లక్షల అంచనాతో నిర్మించే 17 సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇరవెండిలో తుమ్మలపల్లి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేయించాలని రేగాకు రైతులు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం మోతే పట్టీనగర్లో రూ.12లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఐసీడీఎస్ సిబ్బంది రేగాను సత్కరించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో అంతర్గత రహదారులను గుర్తించి సీసీ రోడ్లుగా మార్చేందుకు నిధులు మంజూరు చేసి వాటిని పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, సర్పంచ్లు కొర్సా లక్ష్మి, పోతునూరి సూరమ్మ, తుపాకుల రామలక్ష్మి, కొయ్యల పుల్లారావు, తహసీల్దార్ భగవాన్రెడ్డి, ఎంపీడీవో వివేక్రామ్, ఎంపీవో సునీల్శర్మ, సీడీపీవో ప్రమీల, పీఆర్ డీఈ రాములు, ఏఈ వెంకటేశ్వరరావు, మిషన్ భగీరథ ఏఈ రవితేజ, ట్రాన్స్కో ఏఈ మునీర్పాషా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, కొనకంచి శ్రీను, గుల్ మహ్మద్, బెజ్జంకి కనకాచారి, తుపాకుల రవికుమార్, గోనెల నాని, చిరంజీవి, బాలి శ్రీహరి, పూర్ణ, బానోతు శ్రీను, తిరుపతి ఏసోబు, కాకాని రాంబాబు పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మరు
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై చేసే మాటలు, కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు నమ్మరని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని బూర్గంపహాడ్లో విలేకరులతో మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పొదెం వీరయ్య తనపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై చేస్తున్న ఆరోపణల పట్ల రేగా ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా నడిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు తగవన్నారు. భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచి డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వీరయ్య భద్రాచలం నియోజకవర్గానికి చేసింది ఏమీలేదన్నారు. భద్రాచలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైందే తప్ప ప్రజలకు వీరయ్య చేసింది ఏమీలేదన్నారు. జిల్లా ప్రజలకు తమపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గమే కాక జిల్లాలో ఎక్కడ నిలబడినా వీరయ్య ఓటమి తథ్యమన్నారు. బీజేపీ నాయకులకు వాళ్లు పరిపాలించే రాష్ర్టాల్లో తెలంగాణలో అమలువుతున్న ఒక్క సంక్షేమ పథకమైనా అమలుచేస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు.
ఉప్పునూరి కుటుంబానికి పరామర్శ
మండలంలోని కోయగూడేనికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఉప్పునూరి ప్రభాకర్ తండ్రి రాజు అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మంగళవారం ఆయన నివాసానికెళ్లి రాజు చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబ స భ్యులకు సంతాపం, సానుభూతి తెలిపారు. ఆయన వెం ట టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
బూర్గంపహాడ్, జూన్ 28: బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పంపిణీ చేసి మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వచ్చాక బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, సర్పంచ్ సిరిపురం స్వప్న, తహసీల్దార్ భగవాన్రెడ్డి, ఎంపీడీవో వివేక్రామ్, ఎంపీవో సునీల్శర్మ, టీఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, గోనెల నాని, జక్కం సుబ్రహ్మణ్యం, జక్కం సర్వేశ్వరరావు, భూపెల్లి నర్సింహారావు పాల్గొన్నారు.
లహరికి రేగా నివాళి
మణుగూరు రూరల్, జూన్ 28: మండలంలోని రామనుజవరం గ్రామ ఉపసర్పంచ్ తడికమల్ల ప్రభుదాస్ తమ్ముడి కూతురు లహరి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. సోమవారం జరిగిన దశదిన కర్మకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరై లహరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన వెంట జడ్పీటీసీ పోశం నర్సింహారావు, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, ఆవుల నర్సింహారావు, గుర్రం సృజన్ తదితరులు ఉన్నారు.