జూనియర్ ఎంపీసీలో 33మందికి 460/470 మార్కులు
కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూన్ 28 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా కొత్తగూడెంలోని శ్రీనలంద జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జూనియర్ ఎంపీసీలో కోటా యువరాజ్ 466, పెద్ది దీపిక 466, మాధురి 464, యశస్వి 464, సంతోష్ 464 మార్కులు సాధించారు. బైపీసీలో నామాని సిరి 436, యామిని 435 మార్కులు, ఎంఈసీలో ఆశ్రిత కల్యాణి 491, సృజనవేణి 487, నోముల సాహితి 484 మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీలో లోద్ పూజిత 990 మార్కులు, సుష్మిత 982, చైతన్యసాయి 981, ఎంఈసీలో విద్యాధరి 982, సీఈసీలో ఎం.సాయిప్రణీత్ 966 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ లయన్ ఎంవీ చౌదరి, సీఈవో చైతన్యకృష్ణ, ప్రిన్సిపాల్ ఐవీ మల్లికార్జున్రావు, కళాశాల అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. పుష్పగుచ్ఛాలు అందించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. సేవాభావంతో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నామన్నారు. హైదరాబాద్, విజయవాడ లాంటి కార్పొరేట్ కళాశాలల్లో పనిచేసిన అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఈవో చైతన్యకృష్ణ మాట్లాడుతూ చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లకుండా విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనలందలో చదివిస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ, జేఈఈ మెయిన్స్, అడ్వాన్డ్స్, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు కళాశాలలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.