కూసుమంచి, జూన్ 26 : పోటీ ప్రపంచంలో కష్టపడే వారినే విజయం వరిస్తుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. కష్టించి చదివితే ఉద్యోగాలను తప్పక సాధించవచ్చని స్పష్టం చేశారు. కూసుమంచి మండలం గోపాల్రావుపేటలో శ్రీ సాయి జిన్నింగ్ మిల్లులో కందాళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 70 రోజులుగా నిరుద్యోగులకు నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ ఆదివారం ముగిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ఆలోచనతోనే సొంత ఖర్చుతో కోచింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కుమార్తె దీపిక మాట్లాడుతూ కోచింగ్, ఉచిత మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. సీఐలు సతీశ్, శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉచిత కోచింగ్ వల్ల పాలేరు నిరుద్యోగులకు మంచి అవకాశం లభించిందన్నారు.
స్టడీ మెటీరియల్ అందజేత..
కోచింగ్ తీసుకున్న సుమారు 800 మంది యువతీ యువకులకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఆయన సతీమణి విజయమ్మ, పాలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు స్టడీ మెటీరియల్ను అందించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లాలోని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 30 మంది యువకులు రక్తదానం చేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు మరికంటి ధనలక్ష్మి, ఇంటూరి శేఖర్, రామసహాయం బాలకృష్ణారెడ్డి, బెల్లం ఉమ, బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, వజ్జా రమ్య, యండపల్లి వరప్రసాద్, వేముల వీరయ్య, బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, కరుణాకర్రెడ్డి, అశోక్, సుమ, నందీప్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.