మధిరటౌన్, జూన్ 20: టీఆర్ఎస్తోనే పల్లెల అభివృద్ధి సాధ్యమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. సోమవారం ఎంపీపీ మెండెం లలిత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నదన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పంచాయతీలను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్నారు. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
మధిరటౌన్, జూన్ 20: స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలతో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఎంపీపీ మెండెం లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, వైస్ ఎంపీపీ సామినేని సురేశ్, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.