నేలకొండపల్లి, జూలై 9:మొక్కలను పెంచడం వల్ల కాలుష్యాన్ని నియంత్రించి పర్యవరణాన్ని పరరిక్షించుకోవచ్చని, ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. నేలకొండపల్లి, కోనాయిగూడెం, ముజ్జుగూడెం గ్రామాల్లో మొక్కలు నాటి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, వైస్ ఎంపీపీ పతానపు నాగయ్య, సర్పంచులు రాయపూడి నవీన్, పెంటమళ్ల పుల్లమ్మ, ఉన్నం బ్రహ్మయ్య, ఎంపీటీసీలు బొడ్డు బొందయ్య, దోసపాటి కల్పన, శీలం వెంకటలక్ష్మి, మేళ్లచెరువు అరుణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శాకమూరి సతీశ్, సొసైటీ చైర్మన్లు కోటి సైదారెడి, తన్నీరు సత్యనారాయణ, తహసీల్దార్ సుమ, ఎంపీడీవో చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు వెన్నబోయిన శ్రీను, జోగుపర్తి వీరభద్రం, వంగవేటి నాగేశ్వరావు, కొండా కనకప్రసాదు, గొలుసు రవి, కందరబోయిన భాను పాల్గొన్నారు.
కూసుమంచి రూరల్, జూలై 9: పల్లెప్రగతిలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు శుక్రవారం తొలగించి, గుంతలను పూడ్చారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో మొక్కలను నాటారు. ఎంపీడీవో కరుణాకర్రెడ్డి, ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీఓ రామచందర్రావు పరిశీలించి నాటిన మొక్కలన్నింటినీ బతికించాలన్నారు. పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
తిరుమలాయపాలెం, జూలై 9: పల్లెప్రగతిలో పంచాయతీల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యాయని ఎంపీపీ బోడ మంగీలాల్ తెలిపారు. మండలంలోని తిప్పారెడ్డిగూడెంలో పనులను పరిశీలించారు. దమ్మాయిగూడెంలో హరితహారం మొక్కలు నాటారు. సర్పంచ్లు వేల్పుల జయమ్మ వీరన్న, ఆలస్యం నాగేశ్వరావు, ప్రత్యేకాధికారి అనసూయ, ఎంపీడీవో జయరామ్, ఎంపీవో రాజేశ్వరి, ఏపీవో నర్సింహారావు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, జూలై 9: పనితీరు మార్చుకోకుంటే శాఖాపర చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి హెచ్చరించారు. మండలంలోని చింతపల్లి, ఏదులాపురం, ఆరెంపుల గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను శుక్రవారం తనిఖీ చేసి మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి నాగరాజు, ఎంపీడీవో బీ శ్రీనివాసరావు, మండల వైద్యాధికారి శ్రీదేవి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో శ్రీదేవి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బోనకల్లు, జూలై 9: రాష్ర్టాన్ని హరితహారంగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. ముష్టికుంట్ల గ్రామంలో శుక్రవారం మొక్కలు నాటి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ షేక్ బీజాన్బీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బానోతు కొండ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ హుస్సేన్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దొప్పా కృష్ణ, మైనార్టీసెల్ నాయకులు రఫీ, జాని, రైతుబంధు సమితి జిలా సభ్యుడు మంకెన రమేశ్, నాయుడు పాల్గొన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో పనులను పూర్తిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని అదనపు డీఆర్డీవో పీడీ శిరీష అన్నారు. గోవిందాపురం-ఎల్, లక్ష్మీపురం, తూటికుంట్ల, గార్లపాడు, రావినూతల గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలను శుక్రవారం పరిశీలించారు. సర్పంచ్లు ఉమ్మనేని బాబు, నన్నక లక్ష్మి, కొమ్మినేని ఉపేందర్, దారెల్లి నర్సమ్మ, ఎంపీడీవో జీ శ్రీదేవి, ఎంపీవో శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, ఉపసర్పంచ్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, జూలై 9: పల్లెప్రగతి ద్వారా గ్రామాలకు నూతన శోభ ఏర్పడిందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. రేమిడిచర్ల గ్రామంలో శుక్రవారం మొక్కలు నాటి మాట్లాడారు. అనంతరం బొర్రా సుబ్బారావు సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, సర్పంచ్ పురుషోత్తంరాజు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శీలం వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ఎంపీవో శ్రీలక్ష్మీ, ఏఈవో ధాత్రి, ఎంపీటీసీ అప్పమ్మ, టీఆర్ఎస్ నాయకులు బుర్రా నారాయణ, పంబి శివ, రామయ్య, రామారావు, సాంబశివరావు, భాస్కర్రెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
చింతకాని, జూలై 9: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రణాళికల ద్వారా పల్లెలకు అధిక నిధులు సమకూరుతున్నాయని ఎంపీడీవో రవికుమార్ అన్నారు. శుక్రవారం లచ్చగూడెం, పాతర్లపాడు గ్రామాల్లో సర్పంచ్లు కాండ్ర పిచ్చయ్య, గురజాల ఝాన్సీ, ప్రత్యేకాధికారి సతీశ్తో కలసి మొక్కలు నాటి మాట్లాడారు. వైస్ఎంపీపీ గురజాల హనుమంతరావు, ఉపసర్పంచులు తేలకుంట్ల శ్రీనివాసరావు, సైదేశ్వరరావు, కార్యదర్శి శ్రీరాంకుమార్, ముని, వార్డుసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మధిర రూరల్, జూలై 9: మున్సిపాలిటీ పరిధిలోని పలువార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో శుక్రవారం మురుగు కాల్వల్లో పూడిక, రోడ్ల వెంబడి పిచ్చిమొక్కలను తొలగించారు. ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
మండలంలోని దెందుకూరు గ్రామంలో పల్లెప్రగతి పనులను శుక్రవారం జిల్లా అంగన్వాడీ ప్రాజెక్టు అధికారి సీహెచ్ సంధ్యారాణి, అంగన్వాడీ సీడీపీవో జీ శారద పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ కోట విజయశాంతి, సొసైటీ చైర్మన్ వెంకటకృష్ణ, గ్రామ స్పెషలాఫీసర్ ప్రభాకర్, కార్యదర్శి స్రవంతి పాల్గొన్నారు. రాయపట్నం గ్రామంలో సర్పంచ్ నండ్రు సుశీల ఆధ్వర్యంలో పిచ్చిమొక్కలను తొలగించారు. ఎక్సైజ్ సీఐ బృందం చెరువుకట్టపై మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్యదర్శి స్వాతి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామదీపికలు పాల్గొన్నారు.