రఘునాథపాలెం, జూన్ 6: తెలంగాణ ఉద్యమ కెరటంలో ‘ప్రత్యేక’ గొంతుకగా నిలిచిన ‘నమస్తే తెలంగాణ’ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని 12వ పడిలోకి అడుగు పెట్టింది. సోమవారం నాటికి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెంలో ఉన్న యూనిట్ కార్యాలయంలో పత్రిక బ్రాంచ్ మేనేజర్ రమేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణు, ఎడిషన్ ఇన్చార్జి కాయల పూర్ణచందర్, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు, ప్రొడక్షన్ ఇన్చార్జి జనార్దన్, ఎకౌంటెంట్ విజయ్, హెచ్ఆర్, సబ్ ఎడిటర్లు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.