భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెంలో మిషన్ భగీరథ ద్వారా రూ.రూ.130 కోట్లతో నిధులతో తాగునీటి సమస్యను పరిష్కరించామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన 77 మంది లబ్ధిదారులకు రూ.78 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే విధంగా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహ కానుకగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి అందజేస్తున్నదన్నారు. త్వరలో కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని, కలెక్టరేట్, మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే అధికారమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలకు టీఆర్ఎస్కే పట్టంకడతారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైరపర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, తహసీలార్ రామకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.