దమ్మపేట, మే 27: దమ్మపేట మేజర్ పంచాయతీ పల్లె ప్రగతిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని పాలకవర్గం పంచాయతీని అభివృద్ధి బాట పట్టిస్తున్నది. ప్రధాన రహదారిలోని డివైడర్ మధ్యలో నాటిన మొక్కలు గ్రామానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.. పక్కాగా పారిశుధ్య నిర్వహణతో గ్రామం స్వచ్ఛతవైపు అడుగులు వేస్తున్నది.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ విజయాలను సాధించారు.. వారి కృషిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
దమ్మపేట పంచాయతీ పల్లె ప్రగతిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని పాలకవర్గం పంచాయతీని ప్రగతి బాట పట్టిస్తున్నది. మేజర్ పంచాయతీ అయిన ఈ మండల కేంద్రానికి రూ.15.50 లక్షల ప్రభుత్వ నిధులతో రెండు ట్రాక్టర్లు, వాటర్ట్యాంకు, ట్రక్కు సమకూరాయి. గ్రామంలోని ప్రధాన రహదారి మధ్యలోని డివైడర్ మధ్యలో రూ.2 లక్షలతో పెంచుతున్న మొక్కలు గ్రామానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పంచాయతీ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నది.
నిత్యం అధికారుల పర్యవేక్షణ, ప్రజాప్రతినిధుల సమష్టి నిర్ణయాలతోనే ప్రగతి సాధ్యమైంది. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తుండడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పాయి. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడికి తావు లేకుండా పాలకవర్గం మంచినీటి ట్యాంకుల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేయిస్తున్నది. పంచాయతీ సిబ్బంది పక్కాగా పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు చెత్తచెదారాన్ని సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు పెడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి పసుపులేటి కృష్ణ, పాలకవర్గ సభ్యులు సమష్టిగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరుస్తున్నారు. స్వచ్ఛత దిశగా పంచాయతీని అడుగులు వేయిస్తున్నారు.
పచ్చదనంలోనూ భేష్..
పంచాయతీలో పచ్చందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పాటు అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడంతో పంచాయతీలో గ్రీనరీ ఆకట్టుకుంటున్నది. సిబ్బంది ప్రధాన రహదారికి ఇరువైపులా 1,500 మొక్క లు నాటి వాటి సంరక్షిస్తున్నా రు. హరితహారంలో భాగం గా 900 కోనోకర్పస్ మొక్కలు, 300 బూ గన్ విల్ల మొక్కలు, 300 గన్నేరు మొక్కలు పం చాయతీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
గ్రామస్తుల సహకారంతోనే..
ప్రభుత్వం నుంచి ఠంచనుగా పల్లె ప్రగతి నిధులు విడుదల కావడంతో పాటు గ్రామస్తుల సహకారంతోనే పంచాయతీలో అభివృద్ధి సాధ్యమైంది. గ్రామస్తులు సకాలంలో ఇంటి, నీటిపన్నులు సకాలంలో చెల్లిస్తున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. పారిశుధ్య నిర్వహణగా పక్కాగా చేపడుతున్నాం. హరితహారం మొక్కలను ప్రాణప్రదంగా సంరక్షిస్తున్నాం.
–పసుపులేటి కృష్ణ, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, దమ్మపేట