రఘునాథపాలెం, మే 25: ‘ఓం నమః శివాయ’, ‘జై శ్రీరామ్’ నామస్మరణలతో కోటపాడు గ్రామం మార్మోగింది. భక్తుల కోలాహలం మధ్య శ్రీ వీరభద్రస్వామి, భద్రకాళి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పరమేశ్వరి, నవగ్రహ, ఆలయ జీవధ్వజ, శ్రీ శీతల పరమేశ్వరి, ముత్యాలమ్మ తల్లి, రామాలయం, ఆంజనేయ స్వామి, గంగమ్మతల్లి, మైసమ్మ తల్లి ప్రతిష్ఠామహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయాల ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా హాజరయ్యారు. ఈ వేడుకకు మంత్రి అజయ్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ గుత్తా రవి, సర్పంచ్ బాతుల రమణ సుధాకర్ పాల్గొన్నారు.
కోయచలకలో..: కోయచలక గ్రామంలో శ్రీఅభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంత్రి పువ్వాడ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ మాదంశెట్టి హరిప్రసాద్, ఉప సర్పంచ్ చెరుకూరి పూర్ణ పాల్గొన్నారు.
గణేశ్వరంలో..: సర్పంచ్ యాసా నీలిమ ఆధ్వర్యంలో గణేశ్వరంలో శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. మంత్రి అజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.