మధిరరూరల్, మే 22 : మధిర పట్టణానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కవయిత్రి మహమ్మద్ చాంద్బేగం ‘తేనె ఊటల తెలుగు’ సంకలనంలో సున్నితాలు రచించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్ అందుకున్నారు. నూతన ప్రక్రియ రూపకర్త, సున్నితం సృష్టికర్త నెల్లుట్ల సునీత సంపాదకీయంలో 120మంది కవులు రచించిన 600 సున్నితాలను తేనె ఊటల తెలుగు పేరుతో పుస్తక ముద్రణ చేశారు. నూతన ప్రక్రియ సున్నితం కావడంతో తెలుగు ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కింది. చాంద్బేగం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సుతో పాటు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు, అనేక జాతీయ అవార్డులు, అంతర్జాతీయ లేడీ లెజెండ్ అవార్డు అందుకున్నారు.