కొణిజర్ల, మే 20: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. పెద్దమునగాలలో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే ప్రభుత్వం గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రానున్న రోజుల్లో మండలవ్యాప్తంగా 2,500 మందికి దళితబంధు, 3 వేల మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. సీడీపీ నిధుల్లో సింహభాగం మండలాభివృద్ధికి కేటాయిస్తామన్నారు. ముందుగా సర్పంచ్ పరికపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి ఉచితంగా స్థలం అందించిన సర్పంచ్ శ్రీనివాసరావును ఎమ్మెల్యే అభినందించారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చిరంజీవి, గోసు మధు, పోట్ల కవిత, బీడీకే రత్నం, మూడ్ సురేశ్, చిరంజీవి, బూర ప్రసాద్, అంబేద్కర్, గుండ్ల కోటి, పోట్ల శ్రీనివాసరావు, కోసూరి శ్రీనివాసరావు, ఏలూరి శ్రీనివాసరావు, చెరుకుమల్లి రవి, దొడ్డపునేని రామారావు, రాయల పుల్లయ్య, కొనకంచి మోష, పొట్లపల్లి శేషగిరి, డేరంగుల బ్రహ్మం, రచ్చా రామకోటయ్య, రంగా, ధరావత్ బాబూలాల్, వెంకటప్పయ్య, కావూరి శ్రీను, రెడ్డి పాల్గొన్నారు.