నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 18 ;రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల కార్యాచరణపై బుధవారం హైదరాబాద్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. జిల్లాలో గతంలో పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రస్తుతం ప్రారంభించనున్న పనుల నివేదికలను శాఖల వారీగా సమర్పించారు. ఖమ్మంలో అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయని, నగర మేయర్ పునుకొల్లు నీరజను ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.