భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) :
దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్ముతు న్నాయి. దళితవాడలు.. బంగారు మేడలు కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయవంతంగా అమలులోకి వచ్చింది. మంగళవారం రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్కుమార్ భద్రాద్రి జిల్లాలో 52, ఖమ్మం జిల్లాలో 520 యూని ట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ దినదినాభివృద్ధి చెందుతున్న తెలంగాణ వైపు దేశమంతా చూస్తుంటే కేంద్రం కళ్లు మండుతున్నాయని విమర్శించారు. దళితుల సంక్షేమం కోసం రూ.వేల కోట్లతో తెలంగాణ అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేని బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎక్కడో ఉన్న అయోధ్య రాముడి గురించి మాట్లాడుతున్న కాషాయ నేతలు.. భద్రాద్రి రాముడి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు పేరుతో ఆంధ్రాలో కలపడం బీజేపీ నేతల తప్పు కాదా? అని విమర్శించారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని, రూ.10 లక్షల సాయంతో వ్యాపారం చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.
దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టారు. తొలి విడుత జిల్లాలో 52 యూనిట్లను పంపిణీ చేశారు. మంగళవారం కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రులు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు, రవాణా వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దళిత కుటుంబాల ఆర్థికాభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదన్నారు. రాష్ట్రంలో భావితరాలకు ఉపయోగపడేలా పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చినా.. ఓర్వలేని కొందరు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఉమ్మడి పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చిన సందర్భాలూ తక్కువేనని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగనామ సంవత్సరంగా మారిందన్నారు. వేల ఉద్యోగాలు వచ్చేలా జోనల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సారి దళితబంధు పథకంలో 500 మందికి లబ్ధి చేకూరిందన్నారు. రానున్న విడతలో ఒక్కో నియోజకవర్గానికి 1,500 మందికి చొప్పున ఉమ్మడి జిల్లాలో 15వేల మందికి లబ్ధి కలుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ దళిత కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దళితులు తమ కాళ్లపై తాము నిలదొక్కుకొని సమాజంలోని అన్నివర్గాల వారితో సమానంగా ఆర్థిక ప్రగతిని సాధించాలని, మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.
అరవై ఏళ్లుగా సమాజంలో ఇంకా అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారన్నారు. లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చునని పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా తొలివిడతలో ఒక్కో అసెంబ్లీ పరిధిలో వంద మందిచొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రస్తుతం యూనిట్లను మంజూరు చేస్తున్నామన్నారు. మరో రెండునెలల్లో మలివిడతలో ఒక్కో సెగ్మెంట్ నుంచి రెండు వేల మంది లబ్ధిదారులకు దళితబంధు పంపిణీ చేస్తామన్నారు.
సంక్షేమం స్వర్ణయుగం
తెలంగాణలో సంక్షేమం స్వర్ణయుగంలా ఉంది. తెలంగాణ వచ్చాకే అభివృద్ధి జరిగింది. కులమత, పార్టీలకతీతంగా రైతులకు రైతుబంధు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం. చాలా మంది దళితబంధు టీఆర్ఎస్ వాళ్లకే అంటున్నారు. ఎస్సీలకు కాకుండా వేరే కులస్తులకు ఈ పథకం ఇస్తున్నారా? అది ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రతి పథకం పేదలకు చేరుతుంది.
–ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
చిరస్థాయిగా నిలిచే పథకం
ఏ ప్రభుత్వాలు దళితుల కోసం పథకాలు అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే తొలిసారిగా దళితబంధు పథకం ప్రవేశపెట్టింది. పేదింట్లో పెళ్లి జరిగితే పెద్దన్నగా కేసీఆర్ ఆ కుటుంబానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో అండగా నిలుస్తున్నారు. కేసీఆర్ పాలనలో పేదలు సంతోషంగా జీవిస్తున్నారు. నాడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసినవారు.. నేడు ట్రాక్టర్ ఓనర్ అవుతున్నారంటే అది కేసీఆర్ చలువే..
– కొత్తగూడెం ఎమ్మల్యే వనమా వెంకటేశ్వర్రావు
సద్వినియోగం చేసుకోవాలి
లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకో వాలి. నచ్చిన యూనిట్లు స్థాపించి లాభాల బాటలో పయనించాలి. మీకు జిల్లా యంత్రాంగం అండగా ఉం టుంది. జిల్లాలో దళితబంధు పథకం పూర్తిస్థాయి లో విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకు న్నాం. ప్రభుత్వ సంకల్పాన్ని నూటికి నూరుశాతం నెరవేరుస్తాం.
– భద్రాద్రి కలెక్టర్ అనుదీప్
ప్రగతి పథంలో తెలంగాణ
తెలంగాణ అద్భుత ప్రగతితో దూసుకెళ్తుందని, ఉద్యోగాల నోటిపికేషన్తో యువత ఉత్సాహంగా ఉన్నారన్నారు. సాధించుకున్న తెలంగాణలో 11 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేసుకొని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇదేదో రాజకీయ లబ్ధి కోసమో, ఓట్ల కోసమో ప్రవేశపెట్ట లేదని, ముఖ్యమంత్రి వివిధ వర్గాల వారితో చర్చించి మేధోమదనం చేసిన తర్వాతనే ఈ పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, జడ్పీవైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.