రఘునాథపాలెం, జనవరి 25: ఖమ్మం నగరం అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన గోళ్లపాడు నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భరోసా ఇచ్చారు. గోళ్లపాడుపై ఇళ్లు కోల్పోయిన 25 మంది నిర్వాసితులకు, నిరుడు భారీ వర్షాలకు వెలుగుమట్ల వద్ద ఇళ్ల్లు కట్టుకొని నివాసం ఉంటూ నష్టపోయిన 24 మంది గోళ్లపాడు వాసులకు రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం మంజూరు చేయగా ఆ చెక్కులను మంత్రి అజయ్ మంగళవారం పంపిణీ చేశారు. వెలుగుమట్ల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తహసీల్దార్ శైలజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, కార్పొరేటర్ కూరాకుల వలరాజు, ఏఎంసీ డైరెక్టర్ అజ్మీరా వెంకన్న, స్థానిక నాయకులు వాంకుడోతు సురేశ్, భుక్యా బాషా, బాలాజీ, శ్రావణ్, సత్యం, నాగేశ్వరరావు, హరి, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.