కొణిజర్ల, జూలై 27 : టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన బోడియాతండాకు బానోతు దశ్రు కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ సభ్యత్వ ప్రమాదబీమా ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును ఆయన మంగళ వారం అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ వైస్చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, రైతు బంధు అధ్యక్షుడు దొడ్డపునేని రామారావు, నాయకులు పోట్ల శ్రీనివాసరావు, వై.చిరంజీవి, కోసూరి శ్రీను, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, రాయల పుల్లయ్య, చెరుకుమల్లి రవి, సర్పంచ్ బాలాజీ, మూడ్ సురేశ్, పరికపల్లి శ్రీను, పాసంగులపాటి శ్రీను, గుర్రం వెంకటేశ్వరరావు, కొనకంచి మోష, చింతనిప్పు నరసింహారావు, కొల్లిపాక వెంకటేశ్వర్లు, మద్దినేని నరేశ్, దావా విజయ్, ముత్యాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.