ఖమ్మం, ఏప్రిల్ 12: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల16న ఖమ్మం పర్యటనకు రానున్నారు. గతంలో అనేకసార్లు ఖరారైన ఈ పర్యటన తరువాత వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ నెల 16న మంత్రి కేటీఆర్ పర్యటన ఖరారైంది. ముందుగా ఖమ్మంలో పలు అభవృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
పర్యటన వివరాలు ఇలా..
మంత్రి కేటీఆర్ ఈ నెల 16న ఉదయం 9 హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 10 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 10:15కు రఘునాథపాలెం బృహత్ పల్లె ప్రకృతి వనం (సుడా) పారును ప్రారంభిస్తారు. 10:45కు ఖమ్మం టేకులపల్లి కేసీఆర్ టవర్స్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో 240 ఇళ్లను ప్రారంభిస్తారు. 11:15కు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఫుట్పాత్ను ప్రారంభిస్తారు. 11:45కు గట్టయ్య సెంటర్లోని నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు.
చెత్త సేకరణ కోసం మంజూరైన 10 ట్రాక్టర్లు, 15 ఆటోలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం తీసుకుంటారు. 2:30కు దానవాయిగూడెంలో ఎఫ్ఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. 3 గంటలకు ప్రకాశ్నగర్లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత 3:30కు శ్రీనివాసనగర్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరిగా సాయంత్రం 4 గంటలకు లకారం ట్యాంక్బండ్లో సస్పెన్షన్ బ్రిడ్జి, మ్యూజికల్ ఫౌంటేన్, ఎల్ఈడీ లైటింగ్లను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్తారు.