జూలూరుపాడు/ వైరా టౌన్, డిసెంబర్ 19: సర్వమత సమానత్వమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలకూ సమాన ప్రాతినిథ్యం కల్పిస్తూ వాటి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ నిధులు కేటాయిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన క్రిస్మస్ కానుకలను స్థానిక ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. క్రైస్తవుల్లోనే పేదలు కూడా ఈ పండుగ రోజున సంతోషంగా జరుపుకునేందుకే సీఎం కేసీఆర్ వారికి క్రిస్మస్ కానుకలను పంపిస్తున్నట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కిశోర్, తాళ్లూరి రవి, లేళ్ల వెంకటరెడ్డి, యల్లంకి సత్యనారాయణ, లాకావత్ గిరిబాబు, చౌడం నర్సింహారావు, భూక్యా కళావతి, గాదె నిర్మల, గలిగె సావిత్రి, దుద్దుకూరి మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు.
వైరా/ ఏన్కూరులో..
వైరా టౌన్, డిసెంబర్ 19: వైరాలోని కామిశెట్టి కల్యాణ మండపంలో, ఏన్కూరు రైతు వేదికలో నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే రాములునాయక్ సోమవారం పంపిణీ చేశారు. వైరాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను సైతం లబ్ధిదారులకు అందజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు నారపోగు అరుణ, బీడీకే రత్నం, ముళ్లపాటి సీతారాములు, వేల్పుల పావని, నంబూరి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.